వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఫైనల్ మ్యాచ్లో ఉగ్రబాంబు దాడి కలకలం, 200 మందికి గాయాలు
ఇటలీలోని ట్యూరిన్లో శనివారం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఫుట్బాల్ ప్రేమికులు స్టేడియం వద్దకు వచ్చారు.
రోమ్: ఇటలీలోని ట్యూరిన్లో శనివారం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఫుట్బాల్ ప్రేమికులు స్టేడియం వద్దకు వచ్చారు.
ఈలోగా స్టేడియంలో బాంబు పేలిందని ప్రచారం జరిగింది. దీంతో ప్రేక్షకులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఒకరిని తోసుకుంటూ మరొకరు పారిపోయారు. కిందపడ్డ వారిని అలాగే తొక్కుకుంటూ వెళ్లారు.
దీంతో దాదాపు 200 మంది గాయపడ్డారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణ హానీ జరగలేదు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి మరో పది నిమిషాల్లో మ్యాచ్ పూర్తవుతుందనగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
భారత గగనతలంలోకి దూసుకొచ్చిన చైనా హెలికాప్టర్
అప్పుడు టపాసులు పేలాయి. అవి బాంబుల పేలుడు శబ్దాలని కొందరు ప్రేక్షకులు పెద్దగా అరవడంతో మిగతా ప్రేక్షకులు కంగారు పడి పరుగెత్తారు.
English summary
AFP reporters at the scene said chaotic scenes ensued ten minutes before the end of the match, apparently triggered by fireworks being let off and one or more people shouting that a bomb had gone off.
Story first published: Sunday, June 4, 2017, 12:09 [IST]