2018 నోబెల్ బహుమతులు: క్యాన్సర్పై పరిశోధనలకుగాను జేమ్స్, హోంజోలకు నోబెల్
Recommended Video
స్వీడన్: వైద్య శాస్త్రంలో ఇద్దరిని నోబెల్ పురస్కారం వరించింది. అమెరికాకు చెందిన జేమ్స్ పీ అలిసన్, జపాన్కు చెందిన తసుకు హోంజోలకు ఈ అవార్డు లభించింది. క్యాన్సర్ థెరపీలో ఆవిష్కరణలకు గాను వీరికి అత్యున్నత పురస్కారం దక్కింది.
క్యాన్సర్ చికిత్సలో చెక్ పాయింట్ థెరఫీని కనుగొన్నందుకు నోబెల్ అసెంబ్లీ ఆఫ్ ది కరోలిన్స్కా ఇనిస్టిట్యూట్ వీరిని ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. వీరికి పది లక్షల డాలర్ల నగదు బహుమతిని అందజేస్తారు.
తసుకు హోంజో క్యాన్సర్ ఇమ్యునోథెరపీపై పరిశోధలు చేస్తున్నారు. జేమ్స్ పీ అల్లిసన్.. ఎండీ అండర్సన్ క్యాన్సర్ సెంటర్లో ప్రొపెసర్గా, ఇమ్యునాలజీ విభాగాధిపతిగా ఉన్నారు. ఇమ్యునోథెరఫీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గాను ఉన్నారు.
ప్రతి సంవత్సరం మెడిసిన్ విభాగంలో తొలి నోబెల్ బహుమతిని ప్రకటిస్తారు. డైనమెట్ రూపకల్పన చేసిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరిట దీనిని అందిస్తున్నారు. మంగళవారం ఫిజిక్స్, బుధవారం కెమస్ట్రీ బహుమతులను ప్రకటిస్తారు. శుక్రవారం నోబెల్ శాంతిబహుమతి ప్రకటిస్తారు. మంగళవారం స్వీడన్లో ఆర్థిక శాస్త్రం నోబెల్ పురస్కారాన్ని ప్రకటిస్తారు.