లూసియానాలో ఘోరం: పేరెంట్స్, గర్ల్ ఫ్రెండ్ సహా ఐదుగుర్ని కాల్చి చంపాడు
లూసియానా: అమెరికాలో మరోసారి గన్ కల్చర్ కలకలం చోటు చేసుకుంది. ఇంట్లోకి అడుగు పెట్టవద్దని తల్లిదండ్రులు హెచ్చరించినందుకు ఓ కొడుకు కన్న తల్లిదండ్రులతో పాటు, ప్రియురాలి, మరో ఇద్దరిని తుపాకీతో కాల్చి చంపేశాడు. అనంతరం ట్రక్కులో పారిపోయాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
అమెరికాలోని లూసియానాలో ఈ సంఘటన శనివారం నాడు చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లూసియానా రాష్ట్రంలోని అసెంప్షన్ ప్రాంతానికి చెందిన 21 ఓళ్ల డకోటా థెరియోట్ జులాయి. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనీ, ఇకపై రావొద్దని తల్లిదండ్రులు బెదిరించారు. దీంతో విచక్షణ కోల్పోయిన అతను వారిని కాల్చి చంపాడు.
ఎలాగో తుపాకీ సంపాదించి కాల్పులు
అతను ఎలాగో ఓ తుపాకీని సంపాదించాడు. అనంతరం లివింగ్ స్టన్ ప్రాంతంలో ఉంటున్న బిల్లీ ఎర్నెస్ట్(43), సమ్మర్ ఎర్నెస్ట్ (20), టన్నర్ ఎర్నెస్ట్(17)ను కాల్చిచంపాడు. వీరంతా నిందితుడి కుటుంబానికి పరిచయస్తులేనని అధికారులు తెలిపారు. ఇందులో ఒకరు అతని ప్రియురాలు.
నిందితుడి కోసం గాలింపు
వారి ముగ్గురిని కాల్చి చంపిన తర్వాత వారి ట్రక్కును తీసుకుని ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు కీత్, ఎలిజబెత్ లను వెంటపడి మరీ తుపాకీతో కాల్చి చంపేశాడు. ఆ తర్వాత అదే ట్రక్కులో ఘటనాస్థలం నుంచి పారిపోయాుడ. థెరియోట్ కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
సమ్మర్ ఎర్నెస్ట్తో డేటింగ్లో
పోలీసులు తెలిపిన వివరాల మేరకు డకోటా థెరియోట్ ఇరవై ఏళ్ల సమ్మర్ ఎర్నెస్ట్తో డేటింగ్లో ఉన్నాడు. వారి కుటుంబంతో కొన్ని వారాల పాటు ఉన్నాడు. ఈ నేపథ్యంలో గర్ల్ ఫ్రెండ్ విషయంలో గొడవ కారణంగా గొడవ జరిగి, హత్యకు దారి తీసి ఉంటుందని భావిస్తున్నారు.