షాక్: స్వీట్స్ తిని 23మంది మృతి, ఆస్పత్రిలో 52మంది
లాహోర్: పాకిస్థాన్లో విషాదం ఘటన చోటుచేసుకుంది. పంజాబ్ ప్రొవిన్స్లోని కరర్ లాల్ ప్రాంతంలో ఉమర్ హయత్ నివాసముంటున్నాడు. అతని మనవడి పుట్టినరోజు వేడుక ఏప్రిల్ 17న జరిగింది.
ఈ వేడుకల్లో అందరూ ఆనందంగా పాల్గొన్నారు. అయితే ఆ పుట్టినరోజు జరిగి 24 గంటలు కూడా గడవక ముందే ఆ పార్టీకి వెళ్లివచ్చిన 10 మంది చనిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
52 మంది దాకా అస్వస్థతకు లోనయ్యారు. విషపూరితమైన స్వీట్స్ తినడం వల్లే ఈ ఘోరం జరిగినట్లు పోలీసు విచారణలో తేలింది. పోలీసులు ఆ స్వీట్స్ తయారుచేసిన బేకరీ యజమానిపై కేసు నమోదు చేసి, ముగ్గురిని అదుపులోకి తీసకున్నారు.
స్వీట్స్ను పరీక్షల కోసం పంపారు. స్వీట్లలో పెస్టిసైడ్స్ ఉపయోగించడం వల్లే ఈ మరణాలు చోటు చేసుకున్నాయని పోలీసులు తెలిపారు. ల్యాబ్ టెస్టుల తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పారు.