వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం: 245మంది ఒకేసారి వంతెన మీద నుంచి దూకేశారు

బ్రెజిల్‌లోని హోర్డోలాండియా ప్రాంతంలోని ఓ వంతెన ప్రపంచ రికార్డు సృష్టించేందుకు వేదిక అయింది. 245 మంది ఒకేసారి వంతెన మీద నుంచి కిందకి దూకేశారు.

|
Google Oneindia TeluguNews

బ్రెజిల్: బ్రెజిల్‌లోని హోర్డోలాండియా ప్రాంతంలోని ఓ వంతెన ప్రపంచ రికార్డు సృష్టించేందుకు వేదిక అయింది. 245 మంది ఒకేసారి వంతెన మీద నుంచి కిందకి దూకేశారు.

రికార్డు కోసం దాదాపు 245 మంది (పురుషులు, మహిళలు) వంతెన మీదకు చేరుకొని లైనుగా నిలబడ్డారు. అందరూ రోప్‌ జంపింగ్‌ చేసుకునేందుకు నడుముకు నైలాన్‌ రోప్‌ను కట్టుకున్నారు. అందరూ ఒక్కసారిగా వంతెన మీద నుంచి కిందకి దూకేశారు.

245 People Jumped Off A Bridge Together

30 మీటర్ల ఎత్తైన వంతెన మీద అందరూ రోప్‌తో వేలాడుతూ కనిపించిన దృశ్యం చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. వీళ్లు చేసిన దానిని గిన్నిస్‌ ప్రతినిధులు పరిశీలిస్తున్నారు.

గిన్నిస్‌ వీరి సాహసాన్ని గుర్తిస్తే వీళ్లు గత రికార్డులను చెరిపేసినట్లే. 2016 ఏప్రిల్‌లో ఇదే వంతెనపై 149 మంది ఒకేసారి రోప్‌ జంప్‌ చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు.

English summary
In one adrenaline-loaded stunt, 245 people rope-jumped off a bridge in Brazil. Attached to their harness, 245 men and women simultaneously leaped off a 30-metre-high bridge and swayed like pendulum in a world record attempt in Hortolandia, an hour from Sao Paulo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X