వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

29 మంది మృతి: రైలు-మినీ బస్సు ఢీ, మృతుల్లో మెజార్టీ పాకిస్తానీ సిక్కులే..

|
Google Oneindia TeluguNews

పాకిస్తాన్ పంజాబ్‌లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. కరాచీ నుంచి లాహోర్ వెళ్తున్న షా హుస్సేన్ ఎక్స్ ప్రెస్ రైలు ఫరూదాబాద్ వద్ద మినీ బస్సును ఢీ కొంది. ఈ ప్రమాదంలో 29 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువమంది పాకిస్తానీ సిక్కులే ఉన్నారు. మృతుల సంఖ్య పెరగొచ్చు అని స్ధానిక అధికారులు చెబుతున్నారు.

29 People Killed after Lahore-bound Train Runs over Their Mini-bus

ఫరూదాబాద్ వద్ద మానవ రహిత రైల్వే క్రాసింగ్ వద్ద మధ్యాహ్నం 1.30 ప్రమాదం జరిగింది. ప్రమాద స్ధలి లాహోర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. మినీ బస్సులో ఉన్న వారు నాన్ కా సాహిబ్ వెళ్లి.. తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో ఎక్కువమంది పాకిస్తాన్ సిక్కులేనని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

English summary
29 people, mostly Pakistani Sikhs, were killed when a mini-bus collided with a train in Pakistan's Punjab province on Friday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X