29 మంది మృతి: రైలు-మినీ బస్సు ఢీ, మృతుల్లో మెజార్టీ పాకిస్తానీ సిక్కులే..
పాకిస్తాన్ పంజాబ్లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. కరాచీ నుంచి లాహోర్ వెళ్తున్న షా హుస్సేన్ ఎక్స్ ప్రెస్ రైలు ఫరూదాబాద్ వద్ద మినీ బస్సును ఢీ కొంది. ఈ ప్రమాదంలో 29 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువమంది పాకిస్తానీ సిక్కులే ఉన్నారు. మృతుల సంఖ్య పెరగొచ్చు అని స్ధానిక అధికారులు చెబుతున్నారు.
ఫరూదాబాద్ వద్ద మానవ రహిత రైల్వే క్రాసింగ్ వద్ద మధ్యాహ్నం 1.30 ప్రమాదం జరిగింది. ప్రమాద స్ధలి లాహోర్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. మినీ బస్సులో ఉన్న వారు నాన్ కా సాహిబ్ వెళ్లి.. తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో ఎక్కువమంది పాకిస్తాన్ సిక్కులేనని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
My heartfelt condolences to the families of 19 #Sikh pilgrims who lost their lives & those injured while returning to Gurdwara Sacha Sauda on a Lahore-bound train from #Karachi
— Manjinder Singh Sirsa (@mssirsa) July 3, 2020
They met with an accident near Farooqabad Rly station
We stand in solidarity with their families🙏🏻@ANI pic.twitter.com/K7u9oPrN7V