వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండోనేషియాలో భారీ భూకంపం.. 6.2 తీవ్రతతో ప్రకంపనాలు... ముగ్గురు మృతి

|
Google Oneindia TeluguNews

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సులావేసి దీవుల్లో 6.2 తీవ్రతతో ప్రకంపనాలు వచ్చాయి. దీంతో జనం అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. భూకంప ప్రభావంతో ముగ్గురు చనిపోయారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇండోనేషియాలోని సులావేసి దీవి మజేన్‌కు నగర సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.

భూకంపంతో ఒక హోటల్, గవర్నరు కార్యాలయం తీవ్రంగా దెబ్బతిన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు చెప్పారు. భూకంపం వల్ల విద్యుత్ సరఫరా వ్యవస్థ నిలిచిపోయిందని అధికారులు చెప్పారు. భూకంపం వల్ల పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. 2018లో సులవేసిలో సంభవించిన భూకంపం వల్ల వచ్చిన సునామీ వల్ల వేలాదిమంది మరణించిన సంగతి తెలిసిందే.

3 dead, 24 injured after 6.2 magnitude earthquake strikes Indonesia

భూకంపంతో సునామీ వచ్చే అవకాశం లేదని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. కానీ 7 సెకన్లు మాత్రం భూమి భారీ శబ్దంతో కంపించిందని తెలిపారు. గురువారం రోజున ఇదే జిల్లాలో 5.9 తీవ్రతతో భూమి కంపించిన సంగతి తెలిసిందే.

English summary
three people have died and 24 been injured after a 6.2 magnitude earthquake struck Indonesia's Sulawesi island, the country's disaster mitigation agency said on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X