వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థాన్‌లో పేలుడు, 30 మందికి గాయాలు

పాకిస్తాన్‌లో సోమవారం రాత్రి చోటుచేసుకొన్న పేలుడు ఘటనలో 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో సోమవారం రాత్రి చోటుచేసుకొన్న పేలుడు ఘటనలో 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.

పాకిస్లాన్‌లోని లాహోర్‌లో గల బండ్ రోడ్డులో ఈ పేలుడు సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకొంది. ఈ పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ళ కిటీకీలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహయక చర్యలను చేపట్టారు.

 30 injured in 'explosives-laden truck' blast at Lahore's Band Road

ఓ ట్రక్కులో పేలుడు పదార్దం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకొందని పోలీసులు అనుమానిస్తున్నారు. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

పేలుడు పదార్థాలను తరలించేందుకు ట్రక్కును ఉపయోగించారనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ పేలుడు కారణంగా విద్యుత్ స్థంబాలు , విద్యుత్ వైర్లు దెబ్బతిన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

English summary
At least 30 people were injured in an explosion on Band Road in Lahore on Monday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X