వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మాహుతి దాడులు: 35 మంది దుర్మరణం

|
Google Oneindia TeluguNews

కాబుల్: కాబుల్ పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకున్ని ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 35 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సుమారు 250 మంది వరకు గాయాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. వారిలో చాల మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు అన్నారు.

కాబుల్ లో శుక్రవారం రెండు ప్రాంతాలలో బాంబు పేలుళ్లు జరిగాయి. కాబుల్ లో శుక్రవారం పోలీసు రిక్రూట్ మెంట్ జరిగింది. సాయంత్రం రిక్రూట్ మెంట్ జరుగుతున్న సమయంలో అభ్యర్థుల వరుసలోకి ఒక ఉగ్రవాది ఒంటినిండా బాంబులు పెట్టుకుని వెళ్లాడు.

35 People Killedin Kabul in Afghanistan

తరువాత మెయిన్ గేట్ దగ్గర వరుసలో నిలుచుకున్నాడు. పోలీసులు అతనిని గమనించకుండ వారి పనులలో వారు ఉన్నారు. అదే సమయంలో అతను తనని తాను పేల్చేసుకున్నాడు. ఆ సందర్బంలో సంఘటనా స్థలంలో 20 మంది దుర్మరణం చెందారు.

అనేక మందికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో పోలీసు అధికారులు హడలిపోయారు. అదే విధంగా కాబుల్ లోని షా షహీద్ సైనిక స్థావరం దగ్గర ఒక ట్రక్కులో బాంబులు తీసుకు వెళ్లి పేల్చేశారు.

ఈ పేలుడులో 15 మంది సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. 100 మంది వరకు గాయపడ్డారు. గాయాలైన వారిలో ఎక్కువ మంది మార్చుల్ స్టోన్ కంపెనీ ఉద్యోగులు, మహిళలు, పిల్లలు ఉన్నారని అధికారులు చెప్పారు. ఈ దాడులకు పాల్పడింది ఎవరు అని కచ్చితంగా తెలియడం లేదని అధికారులు తెలిపారు.

English summary
Multiple bombings rocked Kabul Friday, killing at least 35 people and wounding hundreds more in the first major attacks in the Afghan capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X