వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇటలీలో 4.7తీవ్రతతో భూకంపం: పరుగులు తీసిన జనం
రోమ్: ఇటలీలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై 4.7 తీవ్రతతో ఇటలీలో సంభవించిన ఈ భూకంపం కారణంగా స్వల్ప ఆస్తి నష్టం జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు.
ప్రజలెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. మార్చి ప్రాంతంలోని మక్కాయాలో ఈ భూకంప ప్రభావం ఎక్కువగా కనిపించిందని తెలిపారు. భూమి కంపించడంతో ఆందోళనకు గురైన ప్రజలు తమ నివాసాల నుంచి బయటికి పరుగులు తీశారని చెప్పారు.
కాగా, 2016లో సంభవించిన భారీ భూకంపంతో భారీ ప్రాణ నష్టం జరిగింది. ఈ భూకంపం తీవ్రత 6.2ఉండటంతో సుమారు 300లకు పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. వేలాది మంది గాయాలపాలయ్యారు. అనేక మంది తమ నివాసాలను కోల్పోయి నిరాశ్రయులయ్యారు.
Comments
English summary
An earthquake measuring 4.7 magnitude on Tuesday hit an area of central Italy that was devastated by a major quake in 2016, officials said. Early reports said the Tuesday quake caused some minor damage but no serious injuries.
Story first published: Tuesday, April 10, 2018, 15:46 [IST]