చైనాపై తైవాన్ అధ్యక్షుడు ఆగ్రహాం: యుద్ధ విమానాలు తిరగడంపై అభ్యంతరం..
చైనా దుందుకుడు చర్యలపై తైవాన్ కూడా ఆగ్రహాం వ్యక్తం చేస్తోంది. తూర్పు ఆసియాలో ఉద్రిక్తలను రేకెత్తిస్తోందని తైవాన్ అధ్యక్షులు సాయ్ ఇంగ్ వెన్ ఆరోపించారు. శుక్ర, శని వారాల్లో జలసంధిలో చైనా యుద్ద విమానాలు 40 సార్లు తిరిగాయని తెలిపారు. యుద్ద విమానాలు, బాంబర్లతో రావడా్న్ని ఖండించారు. జలసంధిలో చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నిస్తోన్నారా అని ఫైరయ్యారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొందని వివరించారు.
ప్రస్తుతం తైవాన్ జలసంధి వద్దే కాదు.. ప్రాంతీయ పరిస్థితి ఇదే విధంగా ఉందన్నారు. గత కొద్దిరోజులుగా చైనా సైనిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. మాటలతోనే కాదు.. తమ శక్తి సామర్థ్యం చూపి దాడి చేస్తామని బెదిరింపులకు పాల్పడుతోందని అధ్యక్షుడు సాయ్ ఇంగ్ వెన్ చెప్పారు. ఆర్థిక, ఇందన, పర్యావరణ వ్యవహారాల కోసం అమెరికాతో తైవాన్ చర్చలు జరిపింది. ఎనర్జీ, ఎన్విరాన్ మెంటల్ అఫైర్స్ తదితర అంశాలపై తైవాన్ మాజీ అధ్యక్షులు లీ తెంగ్ హు చర్చలు జరిపారు.
Recommended Video
అయితే ద్వీప సందర్శనను చైనా ఖండించింది. అంతేకాదు తైవాన్-అమెరికా చర్చల ప్రక్రియను నిలిపివేయాలని కోరింది. వాస్తవానికి చైనా-తైవాన్ విడిపోయి 70 ఏళ్లకు పైగా అవుతోంది. కానీ తైవాన్పై అధికారం చెలాయించాలని చైనా అనుకుంటోంది. ఈ క్రమంలో అమెరికాతో స్నేహహస్తం డ్రాగన్కు నచ్చడం లేదు. అందుకోసమే జలసంధిలో యుద్దవిమానాలు మొహరించి.. కయ్యానికి కాలు దువ్వుతోంది.