12 ఏళ్ళైనా ఇంకా 400 మృతదేహాలను గుర్తించలేదు, ఎందుకలా ?
12 ఏళ్ళుగా సునామీ భీభత్సంలో చనిపోయిన వారిలో నాలుగు వందల మృతదేహలను ఇంకా గుర్తించలేదు. నాలుగుదేశాల్లో సుమారు రెండులక్షలకు పైగా మంది చనిపోయారు. అయితే నాలుగు వందల మృతదేహాలను ఇంకా గుర్తించలేదని అధికారులు
బ్యాంకాక్ :సునామీ సృష్టించిన భీభత్సంతో చనిపోయిన నాలుగు వందల మంది మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. నాలుగుదేశాల్లోని రెండులక్షలమందికి పైగా మరణిస్తే ,వారిలో ఇంకా నాలుగు వందల మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉంది.పన్నెండేళ్ళ క్రితం జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారి ఆచూకీ కోసం మృతదేహలు ఇంకా భద్రపర్చారు.
2004 డిసెంబర్ 26వ, తేదిన సునామీ తీవ్ర నష్టాన్ని కల్గించింది. నాలుగుదేశాల్లో ఈ ప్రమాదంతో రెండులక్షలఇరవైఆరువేల మంది చనిపోయారు. భారత్ లోని కొన్ని ప్రాంతాలతో పాటు ఇండోనేషియా, శ్రీలం, థాయ్ లాండ్ దేశాల్లో సునామీ ధాటికి అస్తవ్యస్తంగా మారోపోయాయి.
2004లో డిసెంబర్ 26వ, తేదిన సునామీ కారణంగా కోట్లాది రూపాయాల ఆస్థినష్టం వాటిల్లింది. రెండులక్షలకు పైగా చనిపోయారు.అయితే ఈ ఘటనలో చనిపోయిన వారిలో సుమారు 400 మృతదేహాలను 12 ఏళ్ళు అవుతున్న ఇంకా గుర్తించలేదు.థాయ్ లాండ్ దేశంలోనే ఈ మృతదేహాలు ఇంకా ఉన్నాయి.
థాయ్ లాండ్ లో 5,395 మంది ఈ ఘటనలో చనిపోయారు. వారిలో సుమారు రెండువేల మంది విదేశీ పర్యాటకులు ఉన్నారు. సునామీ తర్వాత మృతదేహాలను గుర్తుపట్టేందుకు సుమారు ఐదువేల మందిని సంప్రదించి వారి బంధువుల మృతదేహాలను అప్పగించారు. కానీ, ఇప్పటివరకు నాలుగు వందల మంది మృతదేహాలను ఇంకా గుర్తుపట్టలేదు.
ఎవరూ గుర్తుపట్టలేదని ఫాంగ్ నగా ఫ్రావిన్స్ పోలీస్ అధికారి ఆనంద్ బూకెర్ క్వా తెలిపారు. పర్యాటక అందాలకు థాయ్ లాండ్ పెట్టింది పేరు. ఏటా 32.4 మిలియన్ల విదేశీ పర్యాటకులు థాయిలాండ్ వస్తుంటారు.