బాత్రూంలో ఊపిరాడక ఆరుగురు మృతి
ఇండోనేషియా రాజధాని జకార్తాలో దోపిడీ దుండగులు ఓ ఇంట్లోని వారినిని బాత్రూంలో బంధించగా ఊపిరాడక వారిలో ఆరుగురు మృతి చెందారు.
జకార్తా: దోపిడీకి వచ్చిన వారు ఇంట్లోని వారిని చిన్న బాత్రూంలో బంధించిన ఘటనలో ఊపిరాడక ఆరుగురు మృతి చెందిన ఉదంతమిది. ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఈ దారుణం చోటుచేసుకుంది.
కత్తులు,
తుపాకులతో
సోమవారం
ఓ
ఇంటికి
దోపిడీకి
వచ్చిన
సదరు
దుండగులు
ఆ
ఇంట్లోని
కుటుంబ
సభ్యులు,
పని
వారు,
డ్రైవర్
సహా
మొత్తం
11
మందిని
బాత్రూంలో
బంధించగా
ఈ
విషయం
మంగళవారం
వెలుగులోకి
వచ్చింది.
మృతులలో
తొమ్మిదేళ్ళ
బాలుడు
కూడా
ఉన్నాడు.
బాత్రూం
గది
అతి
చిన్నగా
ఉండడంతో
ఊపిరాడక
వీరిలో
ఆరుగురు
మృతి
చెందగా,
మరో
5
మంది
కొనప్రాణంతో
బయట
పడ్డారు.
వీరిని
వెంటనే
ఆసుపత్రిలో
చేర్చి
వైద్య
చికిత్స
అందిస్తున్నారు.
అయితే
వీరి
పరిస్థితి
కూడా
విషమంగా
ఉన్నట్లు
పోలీసులు
తెలిపారు.
ఈ అకృత్యం గురించి ఓ పౌరుడి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆ ఇంటికి చేరుకొని బాత్రూం తలుపు విరగగొట్టి కొనప్రాణంతో కొట్టుకుంటున్న బాధితులను కాపాడారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఇంట్లో ఉన్న సిసి కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దోపిడీ నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.