వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాత్రూంలో ఊపిరాడక ఆరుగురు మృతి

ఇండోనేషియా రాజధాని జకార్తాలో దోపిడీ దుండగులు ఓ ఇంట్లోని వారినిని బాత్రూంలో బంధించగా ఊపిరాడక వారిలో ఆరుగురు మృతి చెందారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

జకార్తా: దోపిడీకి వచ్చిన వారు ఇంట్లోని వారిని చిన్న బాత్రూంలో బంధించిన ఘటనలో ఊపిరాడక ఆరుగురు మృతి చెందిన ఉదంతమిది. ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఈ దారుణం చోటుచేసుకుంది.

 6 People Found Dead in a Bathroom

కత్తులు, తుపాకులతో సోమవారం ఓ ఇంటికి దోపిడీకి వచ్చిన సదరు దుండగులు ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు, పని వారు, డ్రైవర్ సహా మొత్తం 11 మందిని బాత్రూంలో బంధించగా ఈ విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. మృతులలో తొమ్మిదేళ్ళ బాలుడు కూడా ఉన్నాడు.
బాత్రూం గది అతి చిన్నగా ఉండడంతో ఊపిరాడక వీరిలో ఆరుగురు మృతి చెందగా, మరో 5 మంది కొనప్రాణంతో బయట పడ్డారు. వీరిని వెంటనే ఆసుపత్రిలో చేర్చి వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ అకృత్యం గురించి ఓ పౌరుడి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆ ఇంటికి చేరుకొని బాత్రూం తలుపు విరగగొట్టి కొనప్రాణంతో కొట్టుకుంటున్న బాధితులను కాపాడారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఇంట్లో ఉన్న సిసి కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దోపిడీ నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

English summary
Six people were found dead inside a house in East Jakarta on Tuesday. These people were claimed to be victims of a robbery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X