మధ్య అమెరికాను వణించిన భూకంపం: జనం పరుగులు
మధ్య అమెరికాను భూకంపం వణికించింది. కరేబియన్ కోస్ట్ ఆఫ్ నికారగువా, కోస్టా రికాలో భారీ తీవ్రతతో భూకంపం సంభవించింది.
వాషింగ్టన్: మధ్య అమెరికాను భూకంపం వణికించింది. కరేబియన్ కోస్ట్ ఆఫ్ నికారగువా, కోస్టా రికాలో భారీ తీవ్రతతో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం నివాసాల నుంచి బయటికి పరుగులు తీశారు.
ఎల్ సల్వెడార్కు 120 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు యూఎస్ జియాలాజికల్ సర్వే అధికారులు వెల్లడించారు. భారీ ప్రకంపనలతో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ భూకంపం వల్ల ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం కలిగినట్లు సమాచారం లేదు.
తైవాన్లోనూ భూకంపం
తైవాన్లో శుక్రవారం తెల్లవారుజామున భూకంపంసంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.4గా నమోదైంది. హ్వాలియాన్ నగరానికి పది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో బయటికి పరుగులు తీశారు.
ఫిబ్రవరిలో తైనన్ నగరంలో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కూలిపోయి 117 మంది మరణించారు. 1999 సెప్టెంబర్లో తైవాన్లో 7.6 తీవ్రతతో అతి భయంకర భూకంపం సంభవించడంతో 2,400 మంది ప్రాణాలు కోల్పోయారు.