చైనాలో అల్లకల్లోలం టైఫూన్ మెరాంటి, పలువురి మృతి
బీజింగ్: చైనాలో టైఫూన్ మెరాంటి అల్లకల్లోలం సృష్టిస్తోంది. టైఫూన్ మెరాంటి కారణంగా దాదాపు పదిమంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అలాగే మరో పదిమంది ఆచూకీ లభ్యం కావడం లేదు. దీని కారణంగా లక్షలాది మంది ప్రజలు ఇండ్లను వదిలి ఇబ్బంది పడుతున్నారు. వారిని రెస్క్యూ టీం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.
టైఫూన్ మెరాంటీ కారణంగా పుజైన్ ప్రావిన్స్లో పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. గంటకు 370 కి.మీ. వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. అత్యధికంగా ఆ ప్రాంతంలో 400 మి.మీ. వర్షపాతం నమోదైంది. జనం భయం గుప్పిట బతుకుతున్నారు.
అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ టైఫూన్ మెరాంటి ధాటికి పది మంది వరకు మృతి చెందడం గమనార్హం. పదుల సంఖ్యలో మందికి గాయాలయ్యాయి. 1949 తర్వాత ఈ ప్రాంతంలో అత్యంత ప్రభావం చూపింది ఇదే. అలాగే, ప్రపంచంలోనే ఈ ఏడాది ప్రభావితమైన టైఫూన్ ఇదే.