97 మంది తాలిబన్ మిలిటెంట్లు హతం
కాబుల్: అఫ్ఘానిస్థాన్ లో తాలిబన్ల ఆధీనంలో ఉన్న పలు ప్రాంతాల్లో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ లో ఉగ్రవాదులు అంతం అయ్యారు. పలు ప్రావిన్స్ లో 97 మంది తాలిబన్ ఉగ్రవాదులు అంతం అయ్యారని ఆఫ్ఘాన్ రక్షణ శాఖ అధికారులు తెలిపారు.
ఆఫ్ఘాన్ రక్షణ శాఖ అధికారులు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మందుపాతరలు నిర్వీర్యం చేశారు.
ఈ ఆపరేషన్ లో 97 మంది ఉగ్రవాదులతో పాటు 12 మంది సైనికులు మరణించారని వెల్లడించారు. పక్టియా ప్రావిన్స్ లోని జని ఖేల్ జిల్లాలో భద్రతా దళాల దాడిలో 57 మంది ఉగ్రవాదులు హతం అయ్యారు.
బఘ్లాన్ ప్రావిన్స్ లో 15 మంది, హెల్మండ్, కాబుల్, కుండుజ్ ప్రావిన్స్ లో 25 మంది ఉగ్రవాదులు అంతం అయ్యారు. తాలిబన్ల ఆధీనంలో ఉన్న ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడానికి ఇంకా దాడులు చేస్తూనే ఉన్నారు. ఈ విషయంపై తాలిబన్లు ఇంకా స్పందించలేదు.