వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారెన్ బఫెట్‌తో లంచ్: రూ.15 కోట్లు చెల్లించిన చైనా కంపెనీ..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వారెన్ బఫెట్ ప్రపంచంలో ఈ పేరు వినని వారుండరంటే నమ్మండి. ప్రపంచ కుబేరుడిగా వారెన్ బఫెట్‌కు పేరు. ఈయనతో లంచ్ చేసేందుకు గాను చైనాకి చెందిన ఓ కంపెనీ దాదాపు రూ. 15 కోట్లు (2,35 మిలియన్ డాలర్లు) చెల్లించేందుకు సిద్ధమైంది.

పేదలు, ఇళ్లు లేని వారి కోసం ఆహారం, వసతి వైద్య చికిత్సల సేవలందించేందుకు గాను శాన్‌ఫ్రాన్సిస్కోలోని టెండీర్లాన్ జిల్లాకు చెందిన గ్త్లెడ్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతి ఏటా ఈ ఛారిటీ విందు ఏర్పాటు చేస్తుంది.

A Chinese businessman is paying $2.35 million to eat lunch with Warren Buffett

గత 16 ఏళ్లుగా గ్త్లెడ్‌ ఫౌండేషన్‌ ఈ వేలంను నిర్వహిస్తోంది. ఈబేలో శుక్రవారంతో ముగిసిన ఐదు రోజుల వేలంపాటలో 76 బిడ్లు దాఖలవగా బీజింగ్‌కు చెందిన డాలియన్ జ్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ కో అనే సంస్థ ఝు యె అత్యధిక మొత్తం చెల్లించి ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్‌తో కలిసి ప్రైవేట్‌ లంచ్‌ చేసే అవకాశాన్ని పొందినట్లు గ్త్లెడ్‌ ఫౌండేషన్‌ తెలిపింది.

మాన్‌హాట్టన్‌లోని స్మిత్ అండ్ వాలెన్‌స్కీ స్టీక్ హౌస్‌లో ఇచ్చే విందులో పాల్గొనడానికి వేలంపాట విన్నర్ తనతో పాటు ఏడుగురిని తీసుకెళ్లొచ్చు. ఈ విందులో 84 ఏళ్ల వారెన్ బఫెట్ తన షేర్ల గురించి మాత్రం మాడ్లాడరని సమాచారం.

గతంలో వారెన్ బఫెట్‌తో కలిసి విందు చేసిన విజేతలు ఆయన కంపెనీ బర్క్‌షైర్ హాత్‌వే గురించి మాట్లాడిన ఆయన పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. 2012లో జరిగిన వేలం పాటలో గ్త్లెడ్‌ ఫౌండేషన్‌ 3.45 మిలియన్ డాలర్లను గెలుపొందింది.

English summary
The chairman of a Chinese company that develops online games has agreed to pay $2,345,678 for a private lunch with billionaire investor Warren Buffett, winning a charity auction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X