వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్యునీషియాలో రైలు, ట్రక్ ఢీకొని 15 మంది దుర్మరణం

|
Google Oneindia TeluguNews

ట్యునిస్: వేగంగా వెళుతున్న రైలు, పెద్ద ట్రక్ ఢీకొనడంతో 15 మంది ప్రయాణికులు దుర్మరణం చెందిన సంఘటన ట్యునిషియా రాజధాని ట్యునిస్ సమీపంలో జరిగింది. ట్యునిషియా దేశంలోనే ఇంత పెద్ద రైలు ప్రమాదం ఎప్పుడు జరగలేదని స్థానిక మంత్రి అంటున్నారు.

మంత్రి తెలిపిన కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మంగళవారం ట్యునిస్ నుండి గఫొర్ నగరానికి రైలు బయలుదేరింది. రైలులో ప్రయాణికులు రద్ది ఎక్కువగా ఉంది. ట్యునిస్ నుండి బయలుదేరిన రైలు 60 కిలో మీటర్ల దూరం వెళ్లింది.

A Large Truck hit the train killing 15 people in Tunisia

ఆ సమయంలో అటువైపు వెళుతున్న లాంగ్ ట్రక్ వేగంగా వెళ్లి రైలును డీకొనింది. ఈ ప్రమాదంలో 14 మంది రైలు ప్రయాణికులు సంఘటనా స్థలంలో, ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మరో ప్రయాణికుడు దుర్మరణం చెందారని అధికారులు తెలిపారు.

రైలు వేగంగా వెళుతున్నదని, ట్రక్ డ్రైవర్ వాహనం వేగంగా నడిపాడని అధికారులు అన్నారు. ఈ ప్రమాదంలో సుమారు 70 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలైనాయి. అందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

English summary
A large truck hit the train killing 14 people on the spot, Xinhua news agency reported. The 15th victim died on way to hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X