విమానం కూలిపోయి ఐదుగురి దుర్మరణం
కొలంబియా: విమానాశ్రయం నుంచి బయలుదేరిన కాసేపటికి విమానం కూలిపోయి ఐదుగురు మరణించిన సంఘటన కొలంబియా రాజధాని బగోటా నగరంలో జరిగింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారని అధికారులు తెలిపారు.
కొలంబియా రాజధాని బగోటాలోని డోరాడో విమానాశ్రయం నుంచి చిన్న విమానం బయలుదేరింది. బయలుదేరిన కాసేపటికి అదే నగరంలోని కమర్షియల్ కాంప్లెక్స్ సమీపంలోని బేకరి దగ్గర విమానం కుప్పకూలిపోయింది.
ఈ ప్రమాదంలో పైలెట్ తో పాటు విమానంలో ఉన్న ముగ్గురు ప్రయాణికులు, బేకరిలో ఉన్న ఓ వ్యక్తి మరణించాడు. ఓ బాలికతో పాటు 12 మందికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
విమానం కుప్పకూలడానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని విమానయాన శాఖ అధికారులు అంటున్నారు. విమానం కూలిపోవడంతో బేకరికి మంటలు వ్యాపించడం వలన అక్కడ పని చేస్తున్న వారితో పాటు పలువురు గాయపడ్డారని, దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.