ఇంత విధ్వేషమా?: వినాయక విగ్రహాలు ధ్వంసం చేసిన మహిళలు(వీడియో)
బహ్రెయిన్: గణపతి ఉత్సవాలు దగ్గరపడుతున్న నేపథ్యంలో మనదేశంలోనేగాక ప్రపంచ దేశాల్లో అనేక వినాయక విగ్రహాలు రూపుదిద్దుకున్నాయి. వీటిని అనేక దుకాణాల్లో అమ్మకానికి పెట్టారు. అయితే, ఓ దుకాణంలో పెట్టిన వినాయక విగ్రహాలను ఇద్దరు ముస్లిం మహిళ నేలకేసి కొట్టి పగలగొట్టింది. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Recommended Video
వినాయక విగ్రహాల ధ్వంసం
అయితే, ఈ ఘటన జరిగింది మనదేశంలో కాదు.. బహ్రెయిన్ రాజధాని మనామాలో చోటు చేసుకుంది. ఓ దుకాణంలో వినాయక విగ్రహాలను చూసిన ఇద్దరు ముస్లిం మహిళలు ఆగ్రహంతో ఊగిపోయారు. ఎందుకుపెట్టారంటూ ఆ విగ్రహాలను ఒక్కటొక్కటిగా నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు. షాపు సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. ఆమె ఆపకుండా విగ్రహాలను ధ్వంసం చేశారు.
ఇంత విధ్వేషమా?
కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అంత విద్వేషం ఎందుకు? అంటూ భారతీయులతోపాటు ప్రపంచంలోని ఇతర నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక, ఆ మహిళలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మహిళలను కఠినంగా శిక్షించాలంటూ..
ఏ మతం కూడా మరో మతాన్ని ద్వేషించమని చెప్పదని, విద్వేషం రెచ్చగొట్టేలా ప్రవర్తించిన ఆ ఇద్దరు మహిళలను కఠినంగా శిక్షించాలని, ఆ వివరాలను బహ్రెయిన్ ప్రభుత్వం తెలపాలని డిమాండ్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బహ్రెయిన్ ప్రభుత్వం కూడా స్పందించింది.
పోలీసుల అదుపులో నిందిత మహిళ..
విగ్రహాల విధ్వంసానికి పాల్పడిన 54ఏళ్ల సదరు మహిళను పోలీసులు అరెస్ట్ చేసినట్లు, ఈ ఘటనకు సంబంధించి ఆమెను విచారిస్తున్నట్లు బహ్రెయిన్ మంత్రి ఒకరు వెల్లడించారు. అయితే, ఆ మహిళలపై సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వలాలు ఆగడం లేదు. ఇదే నా మీ పరమత సహనం అంటూ మండిపడుతున్నారు.