అబూ బకర్ బాషీర్: 202 మంది మృతికి కారణమైన బాంబు దాడి సూత్రధారిని విడిచిపెట్టిన ఇండోనేసియా
ఇండోనేసియాలోని బాలీలో 2002లో జరిగిన బాంబు దాడి వెనుక ప్రధాన సూత్రధారి అబూబకర్ బాషీర్ను శిక్షకాలం పూర్తి కాకుండానే జైలు నుంచి విడుదల చేశారు.
రాడికల్ ముస్లిం మతాధికారి అయిన 82 ఏళ్ల అబూ బకర్ ఇండోనేసియా రాజధాని జకార్తా శివార్లలో ఉన్న జైలు నుంచి విడుదలై తమ కుటుంబ సభ్యులను కలుసుకున్నట్లు సమాచారం.
అల్-ఖైదా అడుగుజాడల్లో నడిచే జెమా ఇస్లామియా బృందానికి అబూ బకర్ గతంలో కమాండర్గా ఉన్నారు.
అంతర్జాతీయ పర్యటకులతో కిటకిటలాడే బాలీలోని కూటా నైట్క్లబ్లపై 2002 అక్టోబరు 12న జరిగిన దాడిలో 21 దేశాలకు చెందిన 202 మంది చనిపోయారు.
ఇది ఇండోనేసియా చరిత్రలోనే అత్యంత హేయమైన ఉగ్రవాద దాడి.
ఈ బాంబు దాడిలో అరెస్ట్ అయిన అబూ బకర్ శిక్షాకాలం తగ్గడంతో జైలునుంచి త్వరగా విడుదల అయ్యారు.
అబూ బకర్ విడుదలపై ఇండోనేసియాలో, ఆస్ట్రేలియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి.
అత్యంత దారుణమైన బాంబు దాడికి పాల్పడినవారిని జైలు నుంచి త్వరగా విడుదల చేయడం సముచితం కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
అబూ బకర్ తిరిగి ఉగ్రవాదంవైపు మళ్లొచ్చని వీరి వాదన.
బాలీలో ఈ బాంబు దాడి తరువాత జెమా ఇస్లామియా సంస్థను అదుపు చేసేందుకు ఆస్ట్రేలియా, అమెరికాల సహాయంతో ఇండోనేసియాలో యంటీ-టెర్రరిస్ట్ యూనిట్ ఏర్పాటైంది.
అబూ బకర్ జైలునుంచీ త్వరగా విడుదల కావడం ఇండోనేషియాలో ఉగ్రవాదం, హింసపై పెద్దగా ప్రభావం చూపుతుందని తాను భావించట్లేదని జకార్తా ఇన్స్టిట్యూట్ ఫర్ పాలసీ అనాలసిస్ ఆఫ్ కాంఫ్లిక్ట్ డైరెక్టర్ సిడ్నీ జోన్స్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- బాంబులు తయారుచేసిన మిలిటెంటే ఉగ్రవాదుల్లో మార్పు తెస్తున్నాడు
- అమెరికా అల్లర్లు: అధికారం అప్పగించడానికి నేను సిద్ధం - డోనల్డ్ ట్రంప్
- ఔరంగాబాద్: ఈ నగరం పేరు మార్చడంపై వివాదం ఎందుకు... హైదరాబాద్తో సంబంధమేమిటి
- 'అన్నీ పోను రూ. 500 నెల జీతం’.. అందుకే కార్మికులు తిరగబడి ఫ్యాక్టరీని ధ్వంసం చేశారా
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- "నన్నెందుకు వదిలేశావు? పురుగుల మందు తాగి చనిపోతున్నా"
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- సునీల్ గావస్కర్ సర్ బ్రాడ్మన్ రికార్డును ఎలా బ్రేక్ చేశారు... అప్పుడు అసలేం జరిగింది?
- ఆలయానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్, హత్య... పూజారే నిందితుడు
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)