వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుప్పకూలిన సైనిక హెలికాప్టర్: 20మంది మృతి

|
Google Oneindia TeluguNews

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఫరా ప్రావిన్స్‌లో ఓ సైనిక హెలికాప్టర్ కుప్పకూలి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫరా ప్రావిన్స్‌లోని అనార్‌ దరా జిల్లా నుంచి హెరత్‌ ప్రావెన్స్‌కు బయల్దేరిన ఓ సైనిక హెలికాప్టర్ బుధవారం ఉదయం 9.10 గంటల సమయంలో కూలిపోయింది.

అనార్‌ దరా బేస్‌ నుంచి హెలికాప్టర్ టేకాప్‌ అయిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరిగింది. అదే సమయంలో హెలికాప్టర్‌లో '207 జాఫర్‌ మిలిటరీ కార్ప్స్‌' అధికారులతో పాటు ఫరా ప్రావిన్షియల్‌ కౌన్సిల్‌ సభ్యులు మొత్తం 20 మంది ఉన్నారు. ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని జాఫర్‌ మిలిటరీ కార్ప్స్‌ అధికార ప్రతినిధి నజీబుల్లా నజీబీ తెలిపారు.

188మందితో సముద్రంలో కుప్పకూలిన విమానం: నడిపింది ఇండియన్ పైలట్, బదిలీ కోరిన నెలల్లోనే..188మందితో సముద్రంలో కుప్పకూలిన విమానం: నడిపింది ఇండియన్ పైలట్, బదిలీ కోరిన నెలల్లోనే..

Afghanistan: Military chopper with 20 onboard crashes, all feared dead

మృతుల్లో ఫరా ప్రావిన్షియల్‌ కౌన్సిల్‌ చీఫ్‌ ఫరీద్‌ భక్తావర్‌, 207 జాఫర్‌ మిలిటరీ కార్ప్స్‌ డిప్యూటీ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ నెమతుల్లా ఖలీల్‌ కూడా ఉన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే హెలికాప్టర్ కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. 188మంది ప్రయాణికులతో కూడిన ఇండోనేషియా విమానం ఇటీవలే సముద్రంలో పడిన దుర్ఘటన మరువక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం విచారకరం.

English summary
A military helicopter with 20 people onboard is said to have crashed in western Afghanistan onj Wednesday (October 31). The chopper crashed in Afghanistan's Farah province.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X