ఎయిర్ ఏషియా: వారికి తెలుసు, కూలిపోతుందని పైలట్ అరిచాడు!
జకర్తా: గత ఏడాది డిసెంబర్ నెలలో జావా సముద్రంలో కూలిన విమానంలో ఉన్న వారికి.. విమానం కూలుతోందని ముందే తెలుసు. విమానం బ్లాక్ బాక్స్, ఫ్లయిట్ డేటా రికార్డు గత వారం వెలికి తీసిన విషయం తెలిసిందే. వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఓ అధికారి ఈ విషయమై వెల్లడించారు.
కూలిపోయే ముందు హెచ్చరికలు వచ్చినట్లుగా గుర్తించారు. హెచ్చరికలను గుర్తించిన పైలట్ విమానాన్ని స్థిరీకరించేందుకు ప్రయత్నించాడు. విమానంలో ఉన్న ప్రయాణీకులకు హెచ్చరికలు జారీ చేసాడు. విమానం కూలిపోతుందని అరిచాడు.
అందువల్లే కొందరు లైఫ్ జాకెట్లు ధరించారని తెలిపారు. విమానాన్ని స్థిరీకరించేందుకు పైలట్ చాలా కృషి చేశారని, అయినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఈ బ్లాక్ బాక్స్, ఫ్లైట్ డేటా రికార్డ్ విశ్లేషన వచ్చే వారం ప్రభుత్వానికి చేరనుంది. కాగా, ఎయిర్ ఏషియా విమానం కూలిన ఘటనలో 162 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.