ఎయిర్ఏషియా ఇలా కూలింది: విచారణ అధికారులు
ఇండోనేషియా: గత డిసెంబర్లో జావా సముద్రంలో కూలిన ఎయిర్ ఏషియా విమాన దుర్ఘటనకు సంబంధించిన కారణాలను విచారణ అధికారులు వెల్లడించారు. విమానంలోని రడ్డర్ కంట్రోల్ వ్యవస్థలో ఏర్పడ్డ లోపాల వల్ల పైలెట్లు ఆ విమానాన్ని అదుపు చేయలేకపోయారని విచారణ అధికారులు నిర్ధారించారు.
గత డిసెంబర్లో ఎయిర్ ఏషియా విమానం కూలిన ప్రమాదంలో సుమారు 162 మంది ప్రయాణికులు మరణించారు. ఇండోనేషియాలోని సురబయా విమానాశ్రయం నుంచి సింగపూర్కు బయలుదేరిన ఆ విమానం జావా సముద్రంలో కూలింది.
టేకాఫ్ తీసుకున్న 40 నిమిషాలకే ఆ విమాన జాడ గల్లంతైంది. దాదాపు ఏడాది పాటు విచారణ చేసిన తర్వాత అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. గగనతలంలో ఎగురుతున్న సమయంలో విమానంలో ఉన్న రడ్డర్ కంట్రోల్ సిస్టమ్లోని కంప్యూటర్ లోపానికి గురైంది. దాంతో పైలట్లు దాన్ని సరి చేసే పనిలో మునిగిపోయారు.
ఆ
రోజు
ఫ్లైట్
ఎగిరిన
తర్వాత
అప్పటికే
నాలుగుసార్లు
ఆ
సమస్య
ఉత్పన్నమైంది.
కంట్రోల్
సిస్టమ్ను
రిపేర్
చేసేందుకు
పైలట్లు
కొన్ని
కనెక్షన్లను
తీసేశారు.
దీంతో
ఆటోపైలట్
నుంచి
సమాచారం
కూడా
నిలిచిపోయింది.
ఆ
దశలో
పైలట్లకు
ఎటువంటి
సంకేతాలు
అందలేదు.
గగనతల
గమ్యానికి
సంబంధించిన
సమాచారం
తెలియకపోవడంతో
పైలట్లకు
ఏం
చేయాలో
తెలియలేదు.
ఈలోపు
ఆ
విమానం
ప్రయాణించాల్సిన
మార్గం
మారింది.
ప్లేన్
ఎడమ
వైపు
అడ్డం
తిరిగింది.
దాన్ని
మళ్లీ
దారిలోకి
తెచ్చేందుకు
పైలట్లు
ప్రయత్నించారు.
కానీ
ఆ
టైంలో
అది
నిశ్చలంగా
మారింది.
చివరకు
విమానం
సముద్రంలో
కూలిపోయినట్లు
విచారణ
అధికారులు
స్పష్టం
చేశారు.
ఎయిర్బస్
320
విమానం
గత
ఏడాది
డిసెంబర్
28న
జావా
సముద్రంలో
కూలింది.
కొన్ని
రోజుల
తర్వాత
వాటి
శిథిలాలను
నావికులు
గుర్తించారు.