Ajit Doval:అమెరికాలో ప్రధాని మోదీ ఆయుధం..!
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన పలు కీలక నేతలను కలుస్తూ చర్చలు జరుపుతున్నారు. తాజాగా యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్తో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.వ్యూహాత్మకమైన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరు నేతలు చర్చించారు. ఇజ్రాయిల్, ఈజిప్ట్తో పాటు పలు మిడిల్ ఈస్ట్ దేశాల్లో పర్యటించి అమెరికాకు దోవల్ చేరుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న పలు సవాళ్లను ఎదుర్కొనే దిశగా ఇటు భారత్ అటు అమెరికా దేశాలు కలిసి పని చేస్తున్నాయి. ఈ విషయంలో ఒకొరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటున్నారని సమావేశం అనంతరం యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్లింకెన్ ట్వీట్ చేశారు. వ్యూహాత్మక భాగస్వామ్యం పై ఈ సమావేశంలో తాను అజిత్ దోవల్తో చర్చించినట్లు బ్లింకెన్ స్పష్టం చేశారు. ఇటు అంతర్జాతీయ అటు ప్రాంతీయ సమస్యలపై ఇరు దేశాల మధ్య సహృదభావ వాతావరణంలో చర్చలు జరిగినట్లు ఇండియన్ ఎంబసీ ట్వీట్ చేసింది. ఇక భారత్ నుంచి పలు అధికారులతో అమెరికా చేరుకున్న దోవల్... ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివన్తో కూడా భేటీ అయ్యారు.
The United States is expanding cooperation with India to address global challenges. I had a good meeting with Indian National Security Advisor Ajit Doval today to discuss deepening our strategic partnership. pic.twitter.com/HsTb0S8gKR
— Secretary Antony Blinken (@SecBlinken) February 1, 2023