రెచ్చిపోయిన అల్ఖైదా: జైల్లోకి చొరబడి 200 మందిని తీసుకెళ్లారు
యెమెన్: యెమన్లో ఓ జైలులోకి జొరబడ్డ అల్ఖైదా ఉగ్రవాదులు జైల్లో ఉన్న దాదాపు 200 మంది ఖైదీలను విడిపించుకుని వెళ్లారు. ఖైదీల్లో అల్ఖైదా నాయకులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాదులు ఖైదీలను విడిపించుకుపోయిన సంఘటన కోస్టల్ యెమినిలో గురువారం ఉదయం జరిగింది.
జైలు నుండి తప్పించుకుపోయిన వారిలో అలై ఖైదాకు చెందిన ముఖ్యమైన ఖలీద్ బతార్ఫీ ఉన్నట్లు అధికారులు చెప్పారు. పదుల సంఖ్యలో వచ్చిన అలై ఖైదా ఉగ్రవాదులు నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలను స్వాధీనం చేసుకున్నారు.
వారు స్వాధీనం చేసుకున్న దానిలో కేంద్ర కారాగారం కూడా ఉంది. కేంద్ర కారాగారం, సెంట్రల్ బ్యాంక్, రేడియో స్టేషన్ తదితరాలును వారు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఈ విషయం తెలియడంతో ప్రభుత్వ సాయుద బలగాలు అక్కడకు వచ్చాయి.
ఇరువర్గాల మధ్య పోరు జరిగింది. ఈ సమయంలో చాలామంది ఉగ్రవాదులు అక్కడి నుండి పలాయనం చిత్తగించారని తెలుస్తోంది. కాగా, గత నెల వందలాది మంది ఖైదీలు ఆడెన్లోని మన్సూరా కేంద్ర కారాగారం నుండి తప్పించుకుపోయారు.