భారత్ని నాశనం చేయండి, హిందువుల్ని చంపండి: ఇస్లాం మతపెద్ద (వీడియో)
లాహోర్: ప్రముఖ కాలమిస్ట్, రచయిత తారెక్ ఫతే ఆదివారం నాడు ఓ వీడియోను షేర్ చేశాడు. ఇందులో ప్రముఖ ఇస్లామిక్ మత గురువు ఒకతను పాకిస్తానీలను భారత్ పైకి, హిందువుల పైకి రెచ్చగొడుతున్నట్లుగా ఉంది.
ఇస్లాం మతానికి, నిబంధనలకూ తీవ్ర వ్యతిరేకమైన విగ్రహారాధన చేస్తున్న భారత్ను నాశనం చేయాలని ఇస్లాం మత గురువు, మాజీ బ్యాంకర్ ఇర్ఫాన్ ఉల్ హక్ చెబుతున్న వీడియోను షేర్ చేశారు. ఇది సంచలనం రేపుతోంది.
భారత్ పైన యుద్ధం చేస్తున్న పాకిస్థాన్కు అల్లా తోడుగా ఉంటాడని, హిందువులను హతమార్చాలని కూడా ఇర్ఫాన్ ఆ వీడియోలో అన్నట్లుగా ఉంది. 2011లో ఇర్ఫాన్ ఈ ప్రసంగం చేసినట్టు తారీఖ్ చెబుతున్నారు.
భారత్ పైన యుద్ధం చేస్తున్న పాకిస్థానీలు అల్లా తమ వెంటే ఉన్నాడని భావించాలని, హిందువుల పైన యుద్ధం వారికి దేవుడిచ్చిన గౌరవమని ఇర్ఫాన్ అంటున్నట్లుగా ఉంది. ఈ వీడియోలు చాలామంది తిలకిస్తున్నారు.