నవాజ్ షరీఫ్ కూతురు ఇంటర్వ్యూను ప్రసారం కాకుండా బలవంతంగా ఆపిన పాక్ ప్రభుత్వం..!
పాకిస్థాన్ టెలివిజన్లపై కూడ ఆదేశం ఉక్కుపాదం మోపుతుంది. పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ప్రస్థుతం జైలు జీవితం అనుభవిస్తున్న నవాజ్ షరీఫ్ కూతురుకు చేదు అనుభవం ఎదురైంది. నవాబ్ షరీఫ్ కూతరు మరియమ్ నవాజ్ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్యూని ప్రసారం కాకుండా అర్థంతారంగా,బలవంతంగా ఆపివేశారు.
దీన్ని టెలికాస్ట్ చేసిన పాకిస్థాన్కు చెందిన హమ్ న్యూస్ ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించింది. తమకు పాకిస్థాన్ ప్రభుత్వ ఫ్రీడం ఆఫ్ స్పిచ్ను అణగదొక్కుతుందని తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ చట్టాలు, న్యాయశాఖపై తమకు గౌరవం ఉందని తెలిపారు. ప్రభుత్వ చర్యపై న్యాయపరంగా పోరాడతమని తెలిపారు.
కాగా నవాజ్ షరీఫ్ గత సంవత్సరం డిశంబర్ నుండి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన కూతురు మరియమ్ మీడీయాతో మాట్లాడుతు పాకిస్థాన్ జడ్డీలను బెదిరించి శిక్ష పడే విధంగా తీర్పు వెలువరింప చేసిందని ఆమే ఆరోపణలు చేసింది.కాగా నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఖైదీలుగా ఉన్న ,నేరారోపణలు ఎదుర్కోంటున్న వారుగాని వారి గురించి మీడియాలో మాట్లాడకుండా నిషేధించం విధించారు. దీంతో మరియమ్ మీడియాలో ఇంటర్యూ ఇస్తున్న సంధర్భంలోనే ఆమే షోను అర్థంతరంగా ఆపి వేశారు.