వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
థాయ్లో బాంబు పేలుళ్లు: ఇద్దరు మృతి, 40మందికి గాయాలు
బ్యాంకాక్: థాయ్లాండ్ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. పట్టాని ప్రావిన్స్లోని సదరన్ హోటల్ పార్కింగ్ ప్రాంతంలోనూ, హోటల్ ప్రవేశ ద్వారం వద్ద ఉంచిన ట్రక్కులోనూ మంగళవారం రాత్రి బాంబులు పేలాయి.
ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. రెండు వారాల క్రితం జరిగిన బాంబు పేలుళ్లలో నలుగురు చనిపోగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే.
థాయ్లాండ్కు 10% శాతానికిపైగా ఆదాయం పర్యాటక రంగం నుంచే వస్తోంది. తరుచూ బాంబు పేలుళ్ల ఘటనలు జరుగుతుండటంతో ఆ ప్రభావం పర్యాటకంపై పడుతుందని ప్రభుత్వంతోాపటు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Comments
English summary
Police in Thailand said one person was killed and several others wounded when two bombs exploded late Tuesday in the town of Pattani, in a predominantly Muslim area wracked by a decadelong insurgency.