ఆగని విషాదం: బీచ్కు కొట్టుకొచ్చిన మరో చిన్నారి
జోహన్నెస్బర్గ్: ఇటీవల టర్కీ బీచ్కు కొట్టుకువచ్చిన సిరియా బాలుడు అయిలాన్ కుర్దీ మృతదేహం ప్రపంచాన్ని కదిలించింది. ఈ విషాద ఘటన మరువకముంగే మరో ఘటన చోటు చేసుకుంది. ఓ వలస పడవ సముద్రంలో మునిగిపోవడంతో చనిపోయిన నాలుగేళ్ల చిన్నారి మృత దేహం పశ్చిమ టర్కీలోని ఓ బీచ్కి కొట్టుకొచ్చింది.
ఐజ్మిర్ రాష్ట్రంలోని ఏజియాన్ పట్టణం సముద్రతీరానికి నాలుగేళ్ల బాలిక మృత దేహం కొట్టుకొచ్చిందని స్థానిక మీడియా వెల్లడించింది. అక్కడి మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. 15మందితో వెళుతున్న వలస పడవ అక్కడి చిసో శాంక్ అనే గ్రీకు ద్వీపం సమీపంలో మునిగిపోయింది.
ఎనిమిది మంది పిల్లలు సహా 14 మంది సిరియన్లను కోస్ట్ గార్డ్ దళాలు రక్షించాయి. ఈ నాలుగేళ్ల బాలిక మృతదేహం మాత్రం టర్కీ తీరానికి కొట్టుకువచ్చింది. సిరియాలో నెలకొన్న సంక్షోభంతో శరణార్థుల పరిస్థితి దయనీయంగా మారింది.
కాగా, ఇటీవల మూడేళ్ల బాలుడు అయిలాన్ కుర్దీ మృత దేహం చిత్రం ప్రపంచం మొత్తాన్ని కన్నీరు పెట్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో సిరియా శరణార్థులను తమ దేశాల్లోకి అనుమతించేందుకు పలు దేశాధినేతలు కూడా ముందుకు వచ్చారు.