భారతీయ పాట పాడిందని పాక్ యువతికి భారీ శిక్ష!: ఆమె ఏం చేసిందంటే(వీడియో)
Recommended Video
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఎయిర్పోర్ట్ భద్రతా విభాగం(ఏఎస్ఎఫ్) అధికారులు ఓ 25ఏళ్ల మహిళా ఉద్యోగిపై జరిమానా విధించింది. అంతేగాక, ఆమెకు రావాల్సిన ఇంక్రిమెంట్స్, ప్రోత్సాహకాలను రెండేళ్లపాటు నిలిపివేసింది. ఇంత పెద్ద శిక్ష ఎందుకు విధించారో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే.
పంజాబీ పాట పాడిందని..
భారత్కు చెందిన ఓ పంజాబీ పాటను పాడటమే ఆమె చేసిన నేరమట. పాకిస్థాన్ జాతీయ పతాకం ఉన్న క్యాప్ను ధరించి ఆ యువతి భారతీయ పాటను పాడుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఆమెపై ఉన్నతాధికారులు చర్యలకు ఆదేశించారు.
ఆమె డ్యాన్స్ చేస్తూ పాడిన పాట వైరల్
సియాల్కోట్ ఎయిర్పోర్ట్లో రెండేళ్లుగా పనిచేస్తున్న ఆ యువతి విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ పంజాబీ పాట పాడుతూ సందడి చేసింది. అయితే ఆ సమయంలో ఆమె పాకిస్థాన్ జెండా ఉన్న క్యాప్ను ధరించింది. ఈ వీడియో సోషల్ మీడియాతోపాటు దేశీయ మీడియాలో విస్తృతంగా ప్రసారమైంది.
నిబంధనలు ఉల్లంఘించిందంటూ..
ఈ నేపథ్యంలో సదరు వీడియోపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆ యువతి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిందని పేర్కొంటూ ఏఎస్ఎఫ్ చర్యలు చేపట్టింది.
జరిమానాతోపాటు రెండేళ్ల సర్వీస్ బెనిఫిట్స్ కట్...
ఆమెకు రావాల్సిన ఇంక్రిమెంట్స్, ప్రోత్సాహకాలను రెండేళ్లపాటు నిలిపివేసింది. భవిష్యత్లో ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇలాంటి చర్యలను సహించబోమని ఇతర సిబ్బందికి కూడా తేల్చి చెప్పింది. కాగా, కొందరు ఈ మాత్రం దానికి ఇంత పెద్ద శిక్ష విధించాలా? అని ప్రశ్నిస్తున్నారు.