ఇంట్లోకి దూసుకెళ్ళిన విమానం: పది మంది మృతి
మనీలా: ఫిలిప్పీన్స్లో ఓ విమానం టేకాపైన కొద్దిసేపట్లోకి ప్రమాదానికి గురైంది. విమానం అదుపుతప్పి ఇంట్లోకి దూసుకువెళ్ళింది. ఈ ఘటనలో సుమారు పది మంది మృత్యువాత పడ్డారు.
ఫిలిప్పీన్స్లో ఓ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఓ ఇంట్లోకి దూసుకెళ్ళింది. శనివారం ఈ ఘటన చోటు చేసుకొంది. పీపర్ -23 అపాచీ విమానం బులాకన్ ప్రావిన్స్లోని ప్లారిడెల్ పట్టణంలోని విమానాశ్రయం నుండి విమానం బయలుదేరిన కొద్దిసేపటికే విమానం అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్ళింది.
దీంతో విమానంలోని ఐదుగురితో పాటు ఇంట్లోని ఐదుగురు మృత్యువాత పడ్డారని అధికారులు ప్రకటించారు. ఇంట్లోకి విమానం దూసుకెళ్ళిన వెంటనే విమానం దగ్దమైంది దీంతో మంటలు వ్యాపించాయి.
ఆరుగురు వ్యక్తులు ప్రయాణించే వీలున్న ఈ విమానంలో ప్రమాదం జరిగిన సమయంలో ఐదుగుు ప్రయాణం చేస్తున్నారు అయితే విమానంలోని ఐదుగురు అక్కడి కక్కడే మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు ఇంట్లోకి దూసుకెళ్ళడానికి ముందే విమానం విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.దీంతో విమానం అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్ళిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.