వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నదిలో పడిన బస్సు: 16 మంది జలసమాధి

|
Google Oneindia TeluguNews

లిమా: వేగంగా వెలుతున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోవడంతో ప్రయాణికులు జలసమాధి అయిన సంఘటన పెరూలో జరిగింది. ఈ ప్రమాదంలో గాయాలైన ప్రయాణికులను రక్షించి సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు.

సోమవారం పొద్దుపోయిన తరువాత బస్సులో ప్రయాణికులను తీసుకుని బయలుదేరారు. టర్మ నది తీరంలోని పర్వత ప్రాంతాలపై బస్సు వెలుతున్న సమయంలో అదుపుతప్పింది. డ్రైవర్ బస్సును అదుపు చెయ్యడానికి ప్రయత్నించాడు.

At least 16 people have been killed in peru

అయితే బస్సు అదుపుతప్పి 35 మీరట్ల లోతున ఉన్న నదిలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రయాణికులు జలసమాధి అయ్యారు. 10 మందికి తీవ్రగాయాలైనాయి. విషయం తెలుసుకున్నపోలీసులు సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

గాయాలైన వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్షంగా బస్సును వేగంగా నడపడం వలనే ప్రమాదం జరిగిందని గాయాలైన ప్రయాణికులు చెప్పారని పోలీసులు చెప్పారు. డ్రైవర్ కు గాయాలై చికిత్స పొందుతున్నాడని, కేసు దర్యాప్తులో ఉందని పెరూ పోలీసులు తెలిపారు.

English summary
The bus was taking passengers to the central city of Pichanaki yesterday when the driver lost control and ran off the road.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X