నదిలో పడిన బస్సు: 16 మంది జలసమాధి
లిమా: వేగంగా వెలుతున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోవడంతో ప్రయాణికులు జలసమాధి అయిన సంఘటన పెరూలో జరిగింది. ఈ ప్రమాదంలో గాయాలైన ప్రయాణికులను రక్షించి సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు.
సోమవారం పొద్దుపోయిన తరువాత బస్సులో ప్రయాణికులను తీసుకుని బయలుదేరారు. టర్మ నది తీరంలోని పర్వత ప్రాంతాలపై బస్సు వెలుతున్న సమయంలో అదుపుతప్పింది. డ్రైవర్ బస్సును అదుపు చెయ్యడానికి ప్రయత్నించాడు.
అయితే బస్సు అదుపుతప్పి 35 మీరట్ల లోతున ఉన్న నదిలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రయాణికులు జలసమాధి అయ్యారు. 10 మందికి తీవ్రగాయాలైనాయి. విషయం తెలుసుకున్నపోలీసులు సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
గాయాలైన వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్షంగా బస్సును వేగంగా నడపడం వలనే ప్రమాదం జరిగిందని గాయాలైన ప్రయాణికులు చెప్పారని పోలీసులు చెప్పారు. డ్రైవర్ కు గాయాలై చికిత్స పొందుతున్నాడని, కేసు దర్యాప్తులో ఉందని పెరూ పోలీసులు తెలిపారు.