తైవాన్లో ఘోర రైలు ప్రమాదం: 17 మంది మృతి, చెల్లాచెదురైన రైలు బోగీలు
తైపీ: తైవాన్లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది గాయపడగా, 100 మంది వరకు మృతి చెందారు. తైవాన్లోని నార్త్ ఈస్టర్న్ యిలాన్ కంట్రీలో ఈ దుర్ఘటన జరిగింది. పుయుము ఎక్స్ప్రెస్ రైలు యిలన్ కంట్రీలోని దొంగ్షాన్ - సుగ్జిన్ స్టేషన్స్ మధ్య పట్టాలు తప్పింది. ఇది తైపీకి సమీపంలో ఉంది.
విషాదంలో రెచ్చిన దొంగలు: రైలు డ్రైవర్ సడన్ బ్రేక్వేస్తే ఇంకా ఘోరం!, సిద్ధూ భార్య ఆలస్యంగా రావడంతో
ఈ సంఘటన తైవాన్ కాలమానం ప్రకారం సాయంత్రం ఐదు గంటలకు జరిగింది. దాదాపు ముప్పై నుంచి నలభై మంది వరకు ప్రయాణీకులు చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. ఈ రైలు తైపీలోని షులిన్ స్టేషన్ నుంచి టైటుంగ్లోని ఈస్టర్న్ కోస్టల్ కంట్రీకి ప్రయాణిస్తోంది.
ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 310 మంది వరకు ఉన్నారు. రైలు బోగీలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ విషాదానికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలను పలువురు సోషల్ మీడియాలలో పోస్టు చేశారు.