వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కిర్గిస్థాన్ లో ఘోర విమానప్రమాదం,32 మంది మృతి
కిర్గిస్తాన్ లో సోమవారం ఉదయం విమాన ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 32 మంది మరణించారు.
కిర్గిస్తాన్ : కిర్గిస్థాన్ లో ఓ విమానం కూలిపోయిన ఘటనలో 32 మంది మరణించారు. ఈ విమానం నివాస సముదాయాలపై సోమవారం నాడు ఉదయం కూలిపోయింది. ఈ ఘటన ఎలా జరిగిందనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.
టర్కీష్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం హంకాంగ్ ఇస్తాంబుల్ వరకు వెళ్తోంది.అయితే కిర్గిస్తాన్ మీదుగా ఈ విమానం వెళ్తోంది. కిర్గిస్తాన్ రాజధాని బిష్కేక్ మీదుగా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది.
సోమవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో ఈ విమాన ప్రమాదం చోటుచేసుకొన్నట్టుగా కిర్గిస్థాన్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో దాచా సూగ్రామానికి చెందిన గ్రామస్థులు ఎక్కువగా మరణించినట్టుగా ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ఈ విమాన ప్రమాదంలో నలుగురు పైలెట్లు కూడ మరణించారని అధికారులు ప్రకటించారు.మరో వైపు ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తును చేపట్టారు అధికారులు.
Comments
English summary
a cargo plane attempting to land at kyrgyzstan's main airport in thick fog crashed in a populated area Monday, authorities at the airport said, leaving at least 32 people dead.
Story first published: Monday, January 16, 2017, 10:47 [IST]