వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోర ప్రమాదం: గ్యాస్ ట్యాంకర్ పేలి 35 మంది మృతి, 100 మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

అబుజా: నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 35 మంది వరకు మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. గ్యాస్ టాంకర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరగగానే ఎమర్జెన్సీ బృందం సెమా సహాయక చర్యలు చేపట్టింది.

అబుజాలోని లాఫియా మాకర్ది రహదారి పెట్రోల్ స్టేషన్‌ వద్ద గ్యాస్‌ ట్యాంకర్ ఒక్కసారిగా పేలిందని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై అక్కడి వారు మాట్లాడుతూ... ట్యాంకర్‌లో నుంచి పెట్రోల్ స్టేషన్ సిబ్బంది గ్యాస్ తీసుకుంటున్న సమయంలో పేలుడు సంభవించిందన్నారు. ఈ ఘటనపై దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు.

లింబో అద్భుతం: ఎయిర్ పోర్ట్‌లో సీటు కింద నుంచి ఈ యువతి ఏం చేసిందంటే?లింబో అద్భుతం: ఎయిర్ పోర్ట్‌లో సీటు కింద నుంచి ఈ యువతి ఏం చేసిందంటే?

At Least 35 Die as Nigerian Gas Tanker Explodes

ఈ ప్రమాదంలో గాయాలపాలైన వారిని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటన భయంకరమైన విషాదమని నైజీరియా సెనేట్ ప్రెసిడెంట్ అన్నారు. గాయాలపాలైన వారిని తాను పరామర్శించానని చెప్పారు.

కాగా నైజీరియాలో ఇటువంటి ప్రమాద ఘటనలు తరుచూ చోటు చేసుకుంటున్నాయి. అక్కడి రోడ్లు సరిగ్గా లేకపోవడం, భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి.

English summary
At least 35 people were killed on Monday and hundreds were injured when a gas tanker exploded in the northern Nigerian state of Nasarawa, an emergency services official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X