ఘోర ప్రమాదం: గ్యాస్ ట్యాంకర్ పేలి 35 మంది మృతి, 100 మందికి గాయాలు
అబుజా: నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 35 మంది వరకు మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. గ్యాస్ టాంకర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరగగానే ఎమర్జెన్సీ బృందం సెమా సహాయక చర్యలు చేపట్టింది.
అబుజాలోని లాఫియా మాకర్ది రహదారి పెట్రోల్ స్టేషన్ వద్ద గ్యాస్ ట్యాంకర్ ఒక్కసారిగా పేలిందని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై అక్కడి వారు మాట్లాడుతూ... ట్యాంకర్లో నుంచి పెట్రోల్ స్టేషన్ సిబ్బంది గ్యాస్ తీసుకుంటున్న సమయంలో పేలుడు సంభవించిందన్నారు. ఈ ఘటనపై దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు.
లింబో అద్భుతం: ఎయిర్ పోర్ట్లో సీటు కింద నుంచి ఈ యువతి ఏం చేసిందంటే?
ఈ ప్రమాదంలో గాయాలపాలైన వారిని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటన భయంకరమైన విషాదమని నైజీరియా సెనేట్ ప్రెసిడెంట్ అన్నారు. గాయాలపాలైన వారిని తాను పరామర్శించానని చెప్పారు.
కాగా నైజీరియాలో ఇటువంటి ప్రమాద ఘటనలు తరుచూ చోటు చేసుకుంటున్నాయి. అక్కడి రోడ్లు సరిగ్గా లేకపోవడం, భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి.