మిలిటెంట్లతో హోరాహోరీ పోరు... 50 మంది పోలీసుల మృతి
ఈజిప్టులోని గజా నగరంలో మిలిటెంట్లతో జరిగిన పోరులో 50 మందికి పైగా పోలీసులు మృతిచెందారు. నగర సమీపంలోని ఎల్-వహాత్ ఎడారి ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. అక్కడి బహరియా ఓయాసిస్ వద్ద ఉగ్రవాదులు దాగి ఉన్
కైరో: ఈజిప్టులోని గజా నగరంలో మిలిటెంట్లతో జరిగిన పోరులో 50 మందికి పైగా పోలీసులు మృతిచెందారు. నగర సమీపంలోని ఎల్-వహాత్ ఎడారి ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది.
అక్కడి బహరియా ఒయాసిస్ వద్ద ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారం రావడంతో పోలీసులు, భద్రతా సిబ్బంది అక్కడకు వెళ్లారు. తనిఖీలు చేస్తుండగా.. వారిపైకి మిలిటెంట్లు హఠాత్తుగా కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో 50 మందికి పైగా పోలీసులు, భద్రతా సిబ్బంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరికొందరు గాయపడ్డారు. ఎదురుకాల్పుల్లో కొందరు ముష్కరులు కూడా హతమైనట్లు ఈజిప్టు హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అయితే ఎంత మంది మిలిటెంట్లు చనిపోయారు, వారి వివరాలను మాత్రం వెల్లడించాలేదు. మరోవైపు పోలీసులు, భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడింది తామేనంటూ తీవ్రవాద సంస్థ హసమ్ ప్రకటించింది.
ఇటీవలి కాలంలో ఈజిప్టులో భద్రతా సిబ్బందిపై మిలిటెంట్ దాడులు ఎక్కువయ్యాయి. 2013లో మహ్మద్ మోర్సీని ఈజిప్టు అధ్యక్షుడిగా తొలగించినప్పటి నుంచి ఆర్మీ, పోలీసులపై మిలిటెంట్లు తరచూ దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్లో వందల సంఖ్యలో పోలీసులు, సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు.