కరాచీలో ఘోర రోడ్డు ప్రమాదం: 57 మంది దుర్మరణం?
న్యూఢిల్లీ: పాకస్ధాన్లోని కరాచీలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ ఆయిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొన్న ఘటనలో కనీసం 57 మంతి దుర్మరణం చెందినట్లుగా తెలుస్తోంది.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
బస్సు కరాచీ నుంచి షికాపూర్కు వెళ్తున్న సమయంలో కరాచీకి 50 కిలోమీటర్ల దూరంలో కతోర్ వద్ద అతి వేగంగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో రెండు వాహనాల్లో మంటలు వ్యాపించాయి. దీంతో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతి కావడంతో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది.
సంఖ్యకు మించి జనాభా బస్సులో ఉండటంతో 57 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేంకుడా ఉన్నాయి. ఘటనాస్ధలికి చేరుకున్న అధికారులు శవపరీక్షలు నిర్వహిస్తున్నారు. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని కరాచీ కమిషనర్ షోయబ్ సిద్ధిఖి తెలిపారు.