వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒకాసా ప్రాంతంలో భారీ భూకంపం, ముగ్గురు మృతి
టోక్యో: జపాన్లో భూకంపం కారణంగా ముగ్గురు మృతి చెందగా, 200 మంది వరకు గాయపడ్డట్లుగా తెలుస్తోంది. వెక్టర్న్ జపాన్లోని ఒకాసాతో పాటు పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం ఈ భూకంపం వచ్చింది.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఎనిమిది గంటలకు ముందు ఈ భూకంపం వచ్చింది. చనిపోయిన ముగ్గురిలో 9 ఏళ్ల చిన్న పాప కూడా ఉంది. భూకంప తీవ్రత 6.1 మాగ్నిట్యూడ్గా ఉంది.
భూకంప కేంద్రం ఉత్తర ఒకాసా ప్రాంతానికి 13 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. సునామీ హెచ్చరికలు లేవు. భూకంప తీవ్రతకు ఓ స్విమ్మింగ్ పూల్ గోడ కూలిపోయింది. ఈ కారణంగానే 9 ఏళ్ల చిన్నారి మృతి చెందింది.
Comments
English summary
At least three people were killed and more than 200 injured after a strong quake rocked Osaka in western Japan during the morning rush hour on Monday (Jun 18).
Story first published: Monday, June 18, 2018, 11:41 [IST]