రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్లో కత్తితో దాడి: ఆస్పత్రికి తరలింపు (వీడియో)
న్యూయార్క్: బ్రిటీష్-ఇండియన్ నవలా రచయిత సల్మాన్ రష్దీ పశ్చిమ న్యూయార్క్లో ఉపన్యాసం ఇవ్వబోతుండగా శుక్రవారం దాడి జరిగింది. చౌటాకా ఇన్స్టిట్యూషన్లో ఒక వ్యక్తి వేదికపైకి దూసుకెళ్లి.. రష్దీపై కత్తితో పొడిచాడు. దీంతో రచయిత నేలపై పడిపోయాడు. దాడి చేసిన వ్యక్తిని భద్రతా సిబ్బంది అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు.
గాయపడిన రష్దీని హుటాహుటిన హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు. దాడిలో రష్దీ మెడపై తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, 1988లో ఆయన నవల, ది సాటానిక్ వెర్సెస్ ప్రచురించబడినప్పటి నుంచి రష్దీకి ఇరాన్ నుంచి అనేక మరణ బెదిరింపులు వచ్చాయి. చాలా మంది ముస్లింలు దీనిని దైవదూషణగా భావించినందున ఇరాన్లో ఈ పుస్తకం నిషేధించబడింది.
1989లో ఇరాన్ దివంగత నేత అయతుల్లా రుహోల్లా ఖొమేనీ రష్దీ మరణానికి పిలుపునిస్తూ ఫత్వా జారీ చేశారు. రష్దీని చంపిన వారికి $3 మిలియన్లకు పైగా బహుమానం కూడా ప్రకటించారు.
ఇరాన్ ప్రభుత్వం ఖొమేనీ డిక్రీకి దూరంగా ఉన్నప్పటికీ.. దేశంలో రష్దీపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. 2012లో, సెమీ-అధికారిక ఇరానియన్ మతపరమైన ఫౌండేషన్ రష్దీకి $3.3 మిలియన్లకు పారితోషికాన్ని పెంచింది. కాగా, ఆ సమయంలో, రష్దీ ఆ బెదిరింపును తోసిపుచ్చారని, రివార్డ్పై ప్రజలు ఆసక్తి చూపుతున్నట్లు "ఆధారం లేదు" అని పేర్కొన్నారు.
BREAKING: Author Salman Rushdie stabbed on stage before a lecture in New York pic.twitter.com/vjhG9HMh0g
— Shiv Aroor (@ShivAroor) August 12, 2022
Recommended Video
బ్రిటీష్ రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ ఫెలో, రష్దీ ఇతర గౌరవాలతో పాటు, ఉత్తమ నవలకి విట్బ్రెడ్ బహుమతి (రెండుసార్లు), రైటర్స్ గిల్డ్ అవార్డు, జేమ్స్ టైట్ బ్లాక్ ప్రైజ్, సాహిత్యానికి యూరోపియన్ యూనియన్ అరిస్టీయన్ ప్రైజ్, రచయిత బ్రిటన్, జర్మనీ రెండింటిలోనూ సంవత్సర బహుమతులు, భారతదేశంలో క్రాస్వర్డ్ బుక్ అవార్డు, లండన్ ఇంటర్నేషనల్ రైటర్స్ అవార్డు, యూఎస్ నేషనల్ ఆర్ట్స్ అవార్డు అందుకున్నారు.