వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బెలూచిస్తాన్లో ఉగ్రదాడి: చర్చిలో కాల్పులు, 5గురు మృతి
క్వెట్టా: ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బెలూచిస్తాన్లోని క్వెట్టా ప్రాంతంలోని కేథలిక్ చర్చిలోకి ఉగ్రవాదులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో నలుగురు నుంచి ఐదుగురు మృతి చెందారు. మరో ఇరవై ఐదు మందికి గాయాలయ్యాయి. పోలీసులు చర్చి ప్రాంగణం చుట్టు భద్రతను కట్టుదిట్టం చేశారు.
క్రిస్మస్ ఫెస్ట్ రానున్న నేపథ్యంలో సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం చర్చిలో ప్రార్థనలు జరుగుతుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
Comments
English summary
Gunmen attacked a Catholic church during Sunday mass at Quetta in Balochistan killing four people and injuring 25 injured.
Story first published: Sunday, December 17, 2017, 14:46 [IST]