నేపాల్లో కుప్పకూలిన విమానం: 50 మంది సజీవ దహనం
ఖాట్మండ్: బంగ్లాదేశ్కు చెందిన విమానం సోమవారంనాడు నేపాల్ రాజధాని ఖాట్మండ్లో సోమవారంనాడు కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో 67 మంది ప్రయాణికులు ఉన్నారు. మరో నలుగురు విమాన సిబ్బంది ఉన్నారు. విమానాశ్రయంలో దిగడానికి కొద్ది సేపు ముందు ఖాట్మండ్ శివారులో ఈ ప్రమాదం సంభవించింది. 50 మంది మరణించినట్లు మీడియా వార్తలు వస్తున్నాయి.
Recommended Video
ప్రయాణికుల్లో 20 మందిని వెలికి తీశారు. గాయపడిన ఆ 20 మందిని ఆస్పత్రికి తరలించారు. మిగతా ప్రయాణికుల పరిస్థితి ఏమిటనేది తెలియదు. ఈ విమానం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి బయలుదేరింది.
ప్రమాదానికి గురైన విమానాన్ని యుఎస్ - బంగ్లా ఎయిర్లైన్స్ నడుపుతోంది. ఈ విషయాన్ని విమానాశ్రయం అధికార ప్రతినిధి బీరేంద్ర ప్రసాద్ శ్రేష్ట చెప్పారు. మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
#BREAKING #Nepal: A US-Bangla airlines aircraft has crashed in the eastern side of the Tribhuvan International Airport (TIA) in the #Kathmandu on Monday. Details yet to come. https://t.co/qsxgS4w3sG pic.twitter.com/ODr8L2xS9X
— Pradeep Bashyal (@pdpbasyal) March 12, 2018
An Airplane just crashed at the Kathmandu International Airport. I saw it when it happened. OMG! 2:20 pm #Nepal
— FrugalTravelsNepal (@FrugalTravelsNe) March 12, 2018