భారత్ సర్జికల్ స్ట్రైక్ 2.o .... సహాయం కోసం చైనాను అర్థిస్తున్న పాక్
పుల్వామా దాడితో ప్రతీకార జ్వాలతో రగిలిపోయిన భారత్ ఎట్టకేలకు ఈ రోజు తెల్లవారుజామున సర్జికల్ స్ట్రైక్ చేసి ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని సరిహద్దు ప్రాంతంలో జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై 12 మిరేజ్ యుద్ధ విమానాలతో వెయ్యి కిలోల బాంబులతో దాడి చేసింది. కార్గిల్ వార్ తర్వాత భారత్ చేసిన అతి పెద్ద దాడి ఇది.
భారత్ జరిపిన వైమానిక దాడులతో పాకిస్థాన్ అల్లాడిపోయింది. దిక్కుతోచని స్థితిలో పడిపోయింది ఇవాళ వేకువజామునే జరిగిన యుద్ధ విమానాల దాడులతో పాక్ వణికిపోయింది. వెంటనే పాకిస్థాన్ అలర్ట్ అయింది. పక్కనే ఉన్న చైనాకు ఫోన్ చేసి సాయం కోరింది. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న చందంగా పాక్, చైనా సహాయాన్ని అర్థించింది.
భారత వాయుసేన విమానాలు దాడి చేసి వెనక్కి వెళ్లిన వెంటనే.. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషి... చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వీకి ఫోన్ చేశారు. ప్లీజ్ సహాయం చెయ్యండి అంటూ అర్ధించారు. నిబంధనలకు విరుద్ధంగా వాస్తవాధీన రేఖ దాటి వచ్చి దాడి చేసి వెళ్ళిన ఇండియా పై తిరిగి దాడులు చెయ్యటానికి సహకారం కావాలని కోరండి పాకిస్థాన్.