కరోనా విలయం: తెల్ల జాతీయుల కంటే నల్ల జాతీయులపై ప్రభావం ఎక్కువ, నాలుగు రెట్ల మరణాలు..
కరోనా వైరస్ ప్రభావం నల్ల జాతీయులపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. తెల్ల జాతీయుల కంటే నాలుగురేట్లు ఎక్కువగా బ్లాక్ పీపుల్ చనిపోయే అవకాశం ఉంది. బ్రిటన్లో కరోనా వైరస్పై నేషనల్ స్టాటిస్టిక్స్ అధ్యయనం చేసి.. వివరాలను వెల్లడించింది.
4.3 రెట్లు
నల్లజాతీ మహిళలు తెల్లజాతి మహిళల కన్నా వైరస్ సోకి చనిపోయే అవకాశం 4.3 రెట్లు ఎక్కువగా ఉంది. పురుషుల విషయంలో ఇది 4.2 శాతంగా ఉంతా. బంగ్లాదేశ్, పాకిస్తిన్, భారత్కు చెందిన వారు గణనీయ మరణాలు సంభవించే అవకాశం ఉంది.
నో రీజన్
వయస్సు, ఆరోగ్య సమస్యలతో నల్లజాతీయులు.. తెల్ల జాతీయుల కంటే రెండు రేట్ల ఎక్కువ మరణాలు సంభవించే అవకాశం ఉంది. కానీ దానికి గల కారణాలను మాత్రం నివేదించలేదు. మహమ్మారి ప్రభావం మాత్రం ఎక్కువగా ఉంటుందని మాత్రం పదే పదే నొక్కి వక్కానించింది.
ఆరోగ్యం కోసం..
మరణాల గల అసమానతలపై అధ్యయనం చేయడం అవసరం అని బ్రిటన్ షాడో జస్టిస్ సెక్రటరీ డేవిడ్ లామీ ట్వీట్ చేశారు. లేదంటే ఫలితాల ప్రభావం ఎక్కువగా ఉండేదని చెప్పారు. నల్లజాతీ పురుషులు, స్త్రీల ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అభిప్రాయపడ్డారు.
ఆఫ్రికాలో 3.7 రెట్లు
తెల్ల జాతీ వారి కంటే నల్ల జాతి ఆఫ్రిక ప్రజలు వైరస్ సోకి చనిపోయే సంఖ్య 3.7 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఇనిస్టిట్యూట్ ఫర్ ఫిస్కల్ స్టడీస్ పేర్కొన్నది. భౌగోళిక, జనాభా వ్యత్యాసాల ద్వారా అదనపు మరణాలను లెక్కించలేమని పేర్కొన్నది.
Recommended Video
చికాగోలో 72 శాతం
చికాగోలో చనిపోయిన వారిలో 72 శాతం నల్లజాతీయులు అని అధికారులు తెలిపారు. జనాభాలో ఆప్రికన్లు 30 శాతం మాత్రమే ఉన్నప్పటికీ మరణాలు మాత్రం ఎక్కువగా సంభవించాయి. లుసియానాలో కూడా 32 శాతం జనాభా ఉండగా.. 70 శాతం నల్లజాతీయులే చనిపోయారు. యూరప్లో వైరస్ ప్రభావం బ్రిటన్లో ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు 30 వేల మంది చనిపోయారు.