వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెమికల్ ప్లాంట్‌లో వరుస పేలుళ్లు: 19మంది మృతి

|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనాలోని ఓ రసాయన కర్మాగారంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో 19మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

చెంగ్డులోని యిబిన్ హెంగ్డా టెక్నాలజీ రసాయనిక కర్మాగారంలో ఈ పేలుళ్లు సంభవించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కాగా, పది నిమిషాల వ్యవధిలోనే ఏడు పేలుళ్ల శబ్ధాలు విన్నట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

Blast at Chinese chemical plant kills 19

పేలుళ్ల ధాటికి కర్మాగారంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ ప్రాంతమంత మంటలు, పొగలతో కమ్ముకుంది. మంటలను అదుపు చేసేందుకు అగ్ని మాపక దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

కర్మాగారంలో పేలుళ్లుకు సమీపంలోని భవనాలు అద్దాలు పగిలిపోవడం గమనార్హం.
కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మృతుల కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

English summary
An explosion at a chemical plant in southwest China left 19 dead and injured another 12, authorities said Friday, the latest industrial accident in a country where lax regulations often lead to tragedy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X