వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లిబియా జలాల్లో నౌక మునక: 200 మంది జల సమాధి
ట్రిపోలి: మధ్యధరా సముద్రంలో గురువారం నాడు మరో వలస నౌక జల సమాధి అయింది. ఈ ఘోర ప్రమాదంలో దాదాపు 200 మంది చనిపోయి ఉండొచ్చని లిబియా కోస్ట్ గార్డు అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
జువారా పట్టణం నుండి 400 మందితో కిక్కిరిసిన ఓ నౌక ఇటలీ వైపు బయలుదేరుతూ లిబియా తీర ప్రాంతంలో మునిగి పోయింది. తీర గస్తీ దళాలు 201 మందిని కాపాడాయి. అందులో ఆఫ్రికాకు చెందిన 147 మంది అక్రమంగా వలస వెళ్తున్నట్లు తెలిసింది.
వారందరిని నిర్బంధంలోకి తీసుకున్నట్లు సమాచారం. ఆఫ్రికా, పాకిస్తాన్, సిరియా, మొరాకో, బంగ్లాదేష్ తదితర దేశాల నుండి జల సమాధి అయిన నౌకలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గురువారం జరిగిన వేర్వేరు ఘటనల్లో 1,430 మందిని లిబియా సముద్ర జలాల్లో కాపాడినట్లు ఇటలీ సంస్థ ఒకటి పేర్కొంది.
Comments
English summary
A boat packed with mainly African migrants bound for Italy sank off the Libyan coast on Thursday and officials said up to 200 might have died.
Story first published: Friday, August 28, 2015, 15:51 [IST]