పెషావర్లో బస్సులో పేలిన బాంబు: 15మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని పెషావర్ పట్టణంలో ఉగ్రవాదులు మరోసారి రక్తపాతం సృష్టించారు. ప్రభుత్వ ఉద్యోగులను తీసుకుని వెళ్తోన్న బస్సులో బాంబు పేలి 25 మృతిచెందగా మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన నార్త్ ఈస్ట్ పాకిస్థానీ పట్టణం పెషావర్లో బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
Police Say Bomb Blast Kills 15 on a Moving Bus in Northwest Pakistani City of Peshawar: Police say ... https://t.co/cSNxCJiIFk #WYKO_NEWS
— Breaking News (@wyko_news) 16 March 2016
వివరాల్లోకి వెళితే.... 40 మంది ప్రయాణికులతో మార్దాన్ నుంచి బయలుదేరిన బస్సు పెషావర్లో రద్దీగా ఉండే సరద్ ప్రాంతంలోని మసీదు రోడ్డులో బస్సు ఆగిన సమయంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. మృతుల్లో 10మంది పాక్ సచివాలయ ఉద్యోగులేనని పోలీసులు తెలిపారు.
క్షతగాత్రుల్ని స్థానిక లేడీ రీడింగ్ హాస్పిటల్కి చికిత్స నిమిత్తం తరలించారు. మరికొంత మందిని కంటోన్మెంట్ ఆస్పత్రికి కూడా తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. బాంబు పేలుడు ధాటికి తునాతునకలైన బస్సు 30 నుంచి 40 అడుగుల దూరం ఎగిరి పడినట్టు ప్రత్యక్ష సాక్షుల చెబుతున్నారు.
#ABCNews Bomb Blast Kills 15 in Northwest Pakistani City of Peshawar https://t.co/5Z4kr5YXsM
— News 24/7 (@TopNews24_7) 16 March 2016
బస్సులో ఇలాంటి బాంబు దాడులు జరగడం ఇది మూడోసారని అధికారులు తెలిపారు. 2013లో ఇలాగే పెషావర్ వద్ద బస్సులో బాంబు పేలుడు సంభవించడంతో సివిల్ సెక్రటేరియట్కి చెందిన 19 మంది అధికారులు మృతిచెందగా మరో 44 మంది గాయపడ్డారు.
#Peshawar: Death toll reaches seven in bomb blast in a government bus near Nothia, 15 injured pic.twitter.com/Oy6BARQmu4
— Dunya News (@DunyaNews) 16 March 2016