వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మసీదులో ప్రార్థన టైంలో ఆత్మహుతి దాడి: పాకిస్తాన్లో 22 మంది మృతి!
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో దారుణం జరిగింది. ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. మహ్మద్ ట్రైబల్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ సూసైడ్ బాంబు దాడిలో 22 మంది వరకు మృతి చెందారని తెలుస్తోంది. మరో 35 మంది గాయపడ్డారు.
శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో ఓ దుండగుడు మసీదులోకి చొరబడ్డాడు. అనంతరం తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆప్ఘనిస్తాన్ సరిహద్దులోని పేయిఖాన్ అనే గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
అక్బర్ అనే అధికారి మాట్లాడుతూ.. 20 మందికి పైగా గాయపడ్డారని, ఇందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. తీవ్రంగా గాయపడ్డ వారిని పెషావర్ ఆసుపత్రికి విమానంలో తరలించినట్లు చెప్పారు. ఈ దాడిని జమాత్ ఉల్ అహ్రర్ అనే ఉగ్రసంస్థ చేసినట్లుగా ప్రకటించింది. ఇది పాక్ తాలిబన్ గ్రూప్ సంస్థ.
Comments
English summary
Suicide attack at Pakistan mosque in Mohmand district kills 16, injures 35.
Story first published: Friday, September 16, 2016, 21:08 [IST]