బ్రెగ్జిట్ వైఫల్యం... రాజీనామ చేయనున్న బ్రిటన్ ప్రధాని థెరీసా మే
బ్రెగ్జిట్ ఒప్పందంలో స్వంతపార్టీ ఎంపీల మద్దతు కూడగట్టలేక పోయిన బ్రిటన్ ప్రధాని థేరిసా మే ఎట్టకేలకు రాజీనామాకు సిద్దమయ్యారు. జూన్ 7న తాను కన్సర్వేటీవ్ పార్టీ అధినేత పదవికి రాజీనామ చేస్తున్నట్టు ఆమే ప్రకటించారు. కాగా కోత్త నాయకత్వాన్ని ఎన్నుకునే వరకు ప్రధానిగా కొనసాగుతానని ఆమే ప్రకటించారు.
ఈయులో బ్రెగ్జిట్ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష లేబర్ పార్టీ బ్రిటన్ పార్లమెంట్లో అవిశ్వాస తీర్మాణం పెట్టిన నేపథ్యంలో కన్సర్వేటివ్ మరియు యూనియస్ట్ పార్టీ నేతలు ఆమే రాజీనామపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమే రాజీనామ చేస్తారని గత కొత్తకాలంగా చేస్తారని ప్రచారం జరగింది. ఈనేపథ్యంలోనే ఆమే రాజీనామ చేసినట్టు తెలుస్తోంది.
ఈయూ నుండి బయటకు రావాలంటూ పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన బిల్లు వీగిపోయింది. దీంతో కన్సర్వేటీవ్ పార్టీ సభ్యులే థెరిసా మే కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కాగా బ్రెగ్జిట్ గడవు ఆక్టోబర్ 31వరకు పొడగించిన నేపథ్యంలో ఈయూతో ఒక అంగీకారానికి రాలేని పరిస్థితుల్లో ఆమే రాజీనామాకు ఒత్తిడి తెస్తున్నారు. ఈయు నుండి వైదొలగాన్న ప్రతిపాదనకు 2106లోనే చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజల నుండి మద్దతు లభించింది.